
దర్శి పట్టణంలోని శ్రీ మాధవరెడ్డి ఇ టెక్నో స్కూల్ లో10వ తరగతి విద్యార్థులు త్వరలో ఎదుర్కొనే పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని,ఉత్తమ ఫలితాలు సాధించే లక్ష్యంగాపరీక్షల మెళకువలు, సమయ నిర్వహణ, సమాధానాల రచనపైప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రశ్నాపత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకునే విధానం సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం సమాధానాలను స్పష్టంగా, క్రమబద్ధంగా రాయడం ముఖ్యమైన పాఠ్యాంశాలపై ఫోకస్వంటి అంశాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు స్పష్టమైన సూచనలు అందించారు.పరీక్షలపై ఉన్న భయాన్ని తొలగించి,ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసేలా విద్యార్థులను ప్రోత్సహించే దిశగాశ్రీ మాధవరెడ్డి ఇ టెక్నో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయ బృందంఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
ఈ వార్తను షేర్ చేయండి
